కరోనా నివారణ యుద్దంలో ప్రాణాలొడ్డి పోరాడుతున్న వైద్యులు,వైద్య సిబ్బంది,పోలీసులు,పారిశుద్య కార్మిక సిబ్బందికి అరుదైన గౌరవం లభించింది.త్రివిద దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రకటించిన మేరకు ఆదివారం దేశ వ్యాప్తంగా వివిద ప్రాంతాలలో వైమానిక దళం విమానాల ద్వారా పూలవర్షం కురిపించారు.
పోలీసులు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బంది పై వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. యుసేన పూలవర్షం కురిపించినందుకు ఉత్తేజం పొందిన వైద్యులు ఇతర సేవల సిబ్బంది చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. సిటి పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ సహా పలువురు పోలీస్ అధికారులు , వైద్యాధికారులు పాల్గొన్నారు
No comments