ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషయంలో అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన బతికే ఉన్నాడంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కేసిఎన్ఏ వెల్లడించింది. కిమ్ ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్ చిన్ లో ఓ ఎరువులు కర్మాగారం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని ఈ కార్యక్రమానికి ఆయన సోదరి సహా ఇతర కీలక అధికారులు హాజరయ్యారని మీడియా సంస్థ పేర్కొంది అయితే ఇందుకు సంభందించిన ఫోటోలు కూడ  ఆ సంస్థ బహిర్గతం చేసింది. అయితే ఆఁతర్జాతీయ మీడియాసంస్థలు ఈ వార్తపై ఇంకా స్పందిచాల్సి ఉంది.
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై రక రకాల వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 11 నుండి ఆయన ఆచూకి లభించక పోవడం తో ఆంతర్ జాతీయ మీడియాలో అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆయన హృద్రోగంతో ఉన్నాడని చనిపోయు  ఉండవచ్చని కూడ వార్తలు వచ్చాయి