Breaking News

ఆన్ లైన్ స్లాట్ బుకింగ్స్ మేరకే తిరుమల శ్రీవారి దర్శనం ?

ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ మేరకే దర్శనాలు
ప్రతి నిత్యం పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడప్పుడే సామాన్య భక్తులకు కలిగే అవకాశం లేదు.కరోనా తీవ్రత కారణంగా ప్రస్తుతం తిరుమల తిరుపతిలో కూడ లాక్ డౌన్ కొనసాగుతోంది. మే నెల 17 లాక్ డౌన్ ముగిసే వరకు దర్శనాలు ఉండబోవు. అనంతరం పరిస్థితులపై ఆలయ అధికారులు, ధర్మకర్తలు ఏం చేయాలనే విషయంలో చర్చలు జరుపుతున్నారు.దర్శనాలకు అనుమతులు ఇస్తే భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఎట్లా నియంత్రించాలని ఆలోచిస్తున్నారు.కొంత కాలం పాటు కరోనా తీవ్రత తగ్గే వవరకు  పరిమిత సంఖ్యలో భక్తును అనుమతించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఆర్జిత సేవలు పూర్తిగా నిలిపి వేసే అవకాశాలు కూడ ఉన్నాయి.దర్శనం కోసం వచ్చే భక్తులకు పూర్తిగా ఆన్ లైన్ బుకింగ్ స్లాట్స్ మేరకే దదర్శనాలుకలిపించే యోచనచేస్తున్నారు. పరిమిత సంఖ్యలో భక్తులను ఆన్ లైన్ స్లాట్ సమయాలను బట్టి అనుమతిస్తారు. ఇంతకు మించి మరో మార్గం లేదని టిటిడి అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ విషయం అయినా మే నెల 17 లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరమే తుది నిర్ణయం చేయాలని అధికారులు నిర్ణయించారు.

No comments